Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మహిళా సాధికారిత దిశగా అడుగులు

  • లాల్ బజార్ లో పియంఓ షాపును ప్రారంభించిన డా ఉమర్ ఆలీషా 

హైదరాబాద్, ఏప్రియల్ 13 : సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ లో ఉన్న లాల్ బజార్ కూడలిలో మహిళలచే నిర్వహించబడే పియంఓ (ప్రకృతి మాతృ ఆర్గానిక్) షాపును పిఠాపురం పట్టణానికి చెందిన శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా గురువర్యులు రిబ్బన్ కట్ ప్రారంభించారు. తొలుత ఆయన షాపులో పూజా క్రతువుని పూర్తిచేసి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ స్త్రీ సాధికారత సమాజానికి ఎంతో అవసరమని, సహజ సిద్ధంగా మాతృమూర్తుల స్వహస్తాలతో వండిన వంటకాలను సమాజానికి అందించడం ద్వారా ఎంతో మేలు కలుగుతుందని వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పూర్వకాలపు మనుగడకు దూరంగా యాంత్రిక జీవితం గడుపుతున్న తెలంగాణ రాష్ట్ర నగరవాసులకు అతి చేరువుగా సహజ సిద్ధమైన ఆర్గానిక్ పిండి వంటలను చేరువ చేయాలన్న సంకల్పంతో మాతృమూర్తులు చేపట్టిన ఈ కార్యక్రమం శుభప్రదం కావాలని, ఈ కార్యక్రమం చేపట్టినటువంటి రాజ్యలక్ష్మి, ఉమా, సునీత, చందులను గురువర్యులు దీవించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన నగర ప్రముఖులకు షాపు యాజమాన్యం ఆర్గానిక్ పిండి వంటలను గురువర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా వారి చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ శాఖ సభ్యులు, పీఠం పిఆర్ఓ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర, సీనియర్ జర్నలిస్ట్, సినీ నటుడు, రచయిత బత్తుల ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అడవులను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

Dr Suneelkumar Yandra

సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యానికి మేలు..

TNR NEWS

విజయవంతంగా ముగిసిన పిఠాపురం మండల గ్రామముల ఆవిర్భావ సభ సన్నాహక సమావేశములు

Dr Suneelkumar Yandra

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

Dr Suneelkumar Yandra

రాష్ట్రస్థాయి వేదిక అవార్డు అందుకున్న16 మంది వివిఎస్ స్కూల్ విద్యార్థులు

Dr Suneelkumar Yandra

అక్రమ క్వారీ మైనింగ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు