Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఉద్యమించాలి… అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న పాలకులు… KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి…

భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం దళితులు ఐక్యంగా ఉద్యమించాలని కేవీపీఏస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 135 జయంతి మంగళవారం రాత్రి కోదాడ మండలం గొండ్రియాల గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న పాలకులు రాజ్యాంగం ద్వారా దళితులకు కల్పించబడిన రిజర్వేషన్లు తీసేసే ప్రమాదముందన్నారు. క్రిస్టియన్ మతం మారిన దళితులకు ఎస్సీ హోదా రద్దు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్ష చేయాలన్నారు. దళితులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అరికట్టాలని అన్నారు. టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి దున్న శ్యామ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రయోజనాల కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడని అన్నారు. రాజ్యాంగంలో పొందు పరిచిన హక్కులు, చట్టాలపై అవగాహన పెంచుకొని ఉపయోగించుకోవాలని అన్నారు. అంబేద్కర్ అందరికి సమాన అవకాశాలు కల్పించడానీ అన్నారు. అంబేద్కర్ ఆశయాల కోసం యువత కృషి చేస్తూ కష్టపడి బాగా చదువు కోవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా జీవితాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రజానాట్య మండలి కళాకారులు పాడిన పాటలు, నృత్యాలు ప్రజలను బాగా ఆకర్షించాయి.ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ బట్టు గోపి గ్రామ సర్పంచ్ కలకొండ లచ్చయ్య,గ్రామస్థులు పిదమర్తి బాబురావు,భరత్, లక్ష్మీ,నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కోదాడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

TNR NEWS

మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం

TNR NEWS

యువత ఆన్‌లైన్ బెట్టింగ్ కు బానిస కావొద్దు

TNR NEWS

అంబేద్కర్ యువసేన యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు 

TNR NEWS

నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

TNR NEWS

గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

TNR NEWS