Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అంత్యక్రియలకు అడ్డుపడ్డారు.. సవరాలు బందు పెట్టాం… న్యాయం జరిగే వరకు శుభ,అశుభ కార్యాలకు దూరంగా ఉంటాం…

గ్రామంలో నివాసముంటున్న మాకు సమాన హక్కులేదన్నట్లుగా మా వర్గానికి చెందిన మహిళ మృతదేహాన్ని స్మశాన వాటికలోనికి రానివ్వకపోవడం బాధాకరమని మర్కుక్ నాయి బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు సవరాలు,శుభ,అశుభ కార్యక్రమాల్లో మా కుల వృత్తులను నిర్వహించబోమని ఆందోళన వ్యక్తం చేశారు.సిద్దిపేట జిల్లా మండల కేంద్రమైన మర్కుక్ లోని నాయి బ్రాహ్మణుల వర్గానికి చెందిన లింగంపల్లి ఎల్లమ్మ శుక్రవారం మృతి చెందిగా దహన సంస్కారాలు కోసం గ్రామంలో రెండు స్మశాన వాటికల్లోని ఆయా వర్గాలకు చెందిన వారు అనుమతించలేదు. చివరగా ఊరు శివారులో ఉన్న చెరువులో ఎల్లమ్మ మృత దేహాన్ని దహనం చేశారు. అయితే గ్రామంలోనే నివాసముంటున్న మాకు, సమాన హక్కుగా స్మశాన వాటికల్లోని ఎందుకు అనుమతించరంటూ నాయి బ్రాహ్మణులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు మాట్లాడుతూ హైదారాబాద్ వంటి పెద్ద పెద్ద నగరాల్లో సైతం చనిపోయిన వారందరికీ ఎలాంటి తారతమ్యాలు లేకుండా స్మశాన వాటికల్లో చివరి మజిలీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అలాంటిది మండల కేంద్రమైన మర్కుక్ లో ఇలా కులాల పేరిట దహన సంస్కారాలకు అనుమతించకుండా చనిపోయిన వారి కుటుంబాలకు ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని కులాలతో సమానంగా మా నాయి బ్రాహ్మణులకు సైతం దహన సంస్కరాలకు అడ్డుపడవద్దని వారన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇకనైనా ఇలాంటి కులవివక్షను వీడి అగ్రవర్ణలకు చెందిన వారు అన్ని కులాల వారితో సోదర భావంతో మేధిలితే బాగుంటుందని పేర్కొన్నారు.

Related posts

దేశాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న నిర్మాణ రంగం

TNR NEWS

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

ఈనెల 24న జిల్లా కరాటే అసోసియేషన్ల ముఖ్య సమావేశం

Harish Hs

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

Harish Hs

అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం…. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

టీవీ ఏసి జేఏసీ నిరవధిక సమ్మె పోస్టర్ ఆవిష్కరణ

TNR NEWS