Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు

రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు మృతి చెందారు. 

 

ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో  శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,… ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్‌ బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు..

ఘటన స్థలంలోనే నలుగు రు మృతి చెందగా, ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరో 17 మందికి గాయాల య్యాయి. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షత గాత్రులను చికిత్స నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.

 

Related posts

అకాల వర్షాల దృష్ట్యా రానున్న 3 రోజులు రైతులు అప్రమత్తంగా ఉండాలి…. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS

విజయవంతంగా విదేశీ పర్యటన  స్వాగతం పలికిన షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

TNR NEWS

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి పివైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి

TNR NEWS

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS

సర్వేను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్

Harish Hs

పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జంధ్యాల పూర్ణిమ వేడుకలు

TNR NEWS