May 10, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
క్రైమ్ వార్తలుతెలంగాణ

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు

రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు మృతి చెందారు. 

 

ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో  శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,… ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్‌ బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు..

ఘటన స్థలంలోనే నలుగు రు మృతి చెందగా, ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరో 17 మందికి గాయాల య్యాయి. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షత గాత్రులను చికిత్స నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.

 

Related posts

సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. అధికారిక ఉత్తర్వులు జారీ

TNR NEWS

ఈనెల 20న వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన

TNR NEWS

నర్సరీల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Harish Hs

జూలపల్లి లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు..

TNR NEWS

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

TNR NEWS

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS