Tnrnews.in
క్రైమ్ వార్తలుతెలంగాణ

ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన ప్రవేట్ ట్రావెల్ బస్సు

రోడ్డుపై ఆగి ఉన్న ఇసుక లారీని పొగ మంచుతో రోడ్డు కనిపించక ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఐదుగురు ఒడిశా కూలీలు మృతి చెందారు. 

 

ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో  శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,… ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్‌ బస్సు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఐదుగురు వలస కూలీలు మృతి చెందారు..

ఘటన స్థలంలోనే నలుగు రు మృతి చెందగా, ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. మరో 17 మందికి గాయాల య్యాయి. బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షత గాత్రులను చికిత్స నిమిత్తం సూర్యా పేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. భారీ క్రేన్ సాయంతో బస్సును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు.

 

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Harish Hs

ఆపదలో ఉన్న మిత్రురాలికి పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

TNR NEWS

కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు

TNR NEWS

నూకల నరేష్ రెడ్డి గారి యాది లో

Venu

గురుపౌర్ణమికి ముస్తాబైన సాయిబాబా ఆలయం

Harish Hs

తెలంగాణను తాకిన నైరుతి రుతుపవనాలు

TNR NEWS