తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం విదేశీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవంతంగా పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన అనుచరులతో కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని రోజులుగా దావోస్ తదితర విదేశాలలో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయల నిధులను తెలంగాణ అభివృద్ధి కోసం సమకూర్చి రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కృషిచేసిన సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు..
Save or share this story as a newspaper-style Epaper Clip:
