Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

అసెంబ్లీ ప్రాంగణంలో సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ట్రైలర్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న సలాం సైనికా చిత్రం విడుదల కానుంది. సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తన భావన అని.. ఈ సినిమాలో 200 మంది కొత్త నటులు నటించారని, సినిమా అంతా ఏపీలోనే నిర్మించారన్నారు. సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలకు తమ ప్రోత్సహం ఉంటుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని, కుల, మతాలు, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. పేదవాడికి ఓ చదువు, లేనివాడికి ఓ చదువు అందుతుందని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని అందరూ గ్రహించాలన్నారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని, పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలని మోషేన్ రాజు అన్నారు.

Related posts

యూరియా కొరతతో రైతులు ఆందోళన… సొసైటీలు వద్ద సరుకు కోసం పడిగాపులు

Dr Suneelkumar Yandra

కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – ఎఐటియుసి డిమాండ్

Dr Suneelkumar Yandra

వడ్డాది నుండి గంధవరం వరకు ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభం

Dr Suneelkumar Yandra

గర్భాశయ సమస్యతో బాదపడుతున్న మహిళకి ఆర్థిక సహాయం

Dr Suneelkumar Yandra

గణేష్ ఉత్సవాలకి ప్రభుత్వం ఆంక్షలు విధించవద్దు – విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు

Dr Suneelkumar Yandra

శ్రీవారి అలిపిరి కాలి బాటకు ఇనుపకంచె నిర్మించాలి – రాష్ట్ర ప్రభుత్వానికి టిటిడి బోర్డు 54వ ధర్మకర్తలమండలికి కాకినాడ భోగిగణపతి పీఠం వినతిపత్రం

Dr Suneelkumar Yandra