Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో సినిమా ట్రైలర్ ఆవిష్కరణ

అసెంబ్లీ ప్రాంగణంలో సలాం సైనికా సినిమా ట్రైలర్ ఆవిష్కరణ జరిగింది. ఈ ట్రైలర్‌ను స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 14న సలాం సైనికా చిత్రం విడుదల కానుంది. సైనికులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని తన భావన అని.. ఈ సినిమాలో 200 మంది కొత్త నటులు నటించారని, సినిమా అంతా ఏపీలోనే నిర్మించారన్నారు. సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలకు తమ ప్రోత్సహం ఉంటుందని అయ్యన్న పాత్రుడు అన్నారు. త్రివర్ణ పతాకాన్ని శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల, మత ప్రాంతాలకు అతీతంగా స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారని, ఇంకా అసమానతలు కొనసాగుతున్నాయని, కుల, మతాలు, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టిస్తున్నారన్నారు. పేదవాడికి ఓ చదువు, లేనివాడికి ఓ చదువు అందుతుందని, చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యమని అందరూ గ్రహించాలన్నారు. ప్రజలు తమ హక్కులు గురించి తెలుసుకోవాలని, పాఠ్యాంశాల్లో రాజ్యాంగ విలువల్ని పొందుపరచాలని మోషేన్ రాజు అన్నారు.

Related posts

ఏపీలో వాహనదారులకు పోలీసుశాఖ షాక్ – రేపటి నుంచి భారీ జరిమానాలు

తిరుమల శ్రీవారి సమాచారం…

TNR NEWS

21న పిఠాపురం కు సిపిఐ రాష్ట్ర నేత కే రామకృష్ణ రాక

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో రూ.40 లక్షలకు పైగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

అక్రమ క్వారీ మైనింగ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

ఎన్నికల మేనిఫెస్టో అమలుపై ధైర్యంగా చెప్పండి. 

TNR NEWS