July 1, 2026
Tnrnews.in
ఆంధ్రప్రదేశ్తెలంగాణప్రత్యేక కథనం

యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర

పిఠాపురం, మార్చి 23 : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ వారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న 12 జీవ నదుల పుష్కర పురస్కారాల కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ, సినీ మరియు టీవీ నటి రాగిణి, తొలి టెలివిజన్ వ్యాఖ్యాత విజయ దుర్గ తదితరులు పిఠాపురం పట్టణానికి చెందిన జీవనది ఫౌండేషన్ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్, సినీ రచయిత, దర్శకుడు, పత్రికా సంపాదకుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రను యమునా నది పుష్కర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా డా సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ నదీ జలాల పరిరక్షణ కోసం జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మరియు సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం పుష్కరాలు జరుపుకోబోతున్న పవిత్ర యమునా నదీ పేరిట పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు డా సునీల్ కుమార్ యాండ్ర కు శుభాకాంక్షలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సంప్రదాయ పంటల నుండి చియా వైపు రైతులు చియా సాగు వైపు ఆకర్షితులు ప్రభుత్వ మద్దతు అవసరం తక్కువ ఖర్చుతో అధిక లాభం

TNR NEWS

రోడ్డు నిర్మాణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేత

Harish Hs

పెండింగ్ లో ఉన్న క్లైములకు నిధులు విడుదల చేయాలి

TNR NEWS

1 కోటి 93 లక్షల 49 వేల రూపాయల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు..

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs

ఈనెల 21, 22న దివ్యాంగులకు ఆటల పోటీలు: కె.వి. కృష్ణవేణి

TNR NEWS