Tnrnews.in
ఆంధ్రప్రదేశ్తెలంగాణప్రత్యేక కథనం

యమునా నది పుష్కర పురస్కారం అందుకున్న డాక్టర్ సునీల్ కుమార్ యాండ్ర

పిఠాపురం, మార్చి 23 : ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ వారు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న 12 జీవ నదుల పుష్కర పురస్కారాల కార్యక్రమం రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ, సినీ మరియు టీవీ నటి రాగిణి, తొలి టెలివిజన్ వ్యాఖ్యాత విజయ దుర్గ తదితరులు పిఠాపురం పట్టణానికి చెందిన జీవనది ఫౌండేషన్ జాతీయ మీడియా కో-ఆర్డినేటర్, సినీ రచయిత, దర్శకుడు, పత్రికా సంపాదకుడు డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రను యమునా నది పుష్కర పురస్కారంతో సత్కరించారు. ఈ సందర్భంగా డా సునీల్ కుమార్ యాండ్ర మాట్లాడుతూ నదీ జలాల పరిరక్షణ కోసం జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మరియు సభ్యులు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం పుష్కరాలు జరుపుకోబోతున్న పవిత్ర యమునా నదీ పేరిట పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు డా సునీల్ కుమార్ యాండ్ర కు శుభాకాంక్షలు తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సమస్యల పరిష్కారానికి కృషి…..

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS

ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం 

TNR NEWS

నిరక్షరాస్యత నిర్మూలన పై ప్రత్యేక శ్రద్ధ

Dr Suneelkumar Yandra

బీసీలను మోసం చేసే పార్టీలకు పుట్టగతులుండవు

TNR NEWS

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

TNR NEWS