మన దేశ స్వాతంత్ర్యం సాధన కోసం పోరాడిన సమరయోధులు, అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించినట్లు అదనపు కలెక్టర్ డి.వేణు తెలిపారు.
గురువారం అదనపు కలెక్టర్ డి.వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో అమరుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా *అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ,* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనవరి 30న అమరుల దినోత్సవం గా నిర్వహిస్తున్నామని, మన దేశ స్వాతంత్రం కోసం విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన అనేక మంది అమర వీరులను స్మరిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరిగిందని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరిండెంట్ బండి ప్రకాష్, ఎడి మైన్స్ శ్రీనివాస్,డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి,డివైఎస్ ఓ సురేష్,డివిహెచ్ ఓ శంకర్, బీసీ వెల్ఫేర్ అధికారి రి రంగారెడ్డి,జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.