కరీంనగర్ జిల్లాలో వరి రైతుల మద్దతు కోసం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ, ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీ ఆర్ ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చర్ల బూత్కూరు మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షెడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకి శాల సంపత్ రావు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, రైతుల సంక్షేమం కోసం వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
