Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలోకి చేరికలు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో నందిగామ గ్రామనికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మర్రి నాగరాజు యాదవ్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కంచె రవి,రఘువీర్,పోరిక వినయ్,అడ్డా అశోక్, గణేష్,గుగులోతు పవన్, మూడు సురేష్ బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో శుక్రవారం రాత్రి భారతీయ జనతా పార్టీ లో చేరారు.కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలో పేద,మధ్యతరగతి ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నర్సంపేట నియోజకవర్గంలో యువత పెద్దఎత్తున బీజేపీ పార్టీలో చేరుతున్నారన్నారు.దేశ ప్రజలకు సమర్థ పాలన అందిస్తున్న బీజేపీలో నియోజకవర్గ యువత చేరాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో అమలు కానీ హామీలతో అధికారం చేపట్టి సంవత్సరం దాటుతున్న ఏఒక్క హామీని అమలు చేయకుండా పబ్బం గడుపుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాల్లో నరేంద్ర మోదీ గారు ప్రవేశ పెడుతున్న పథకాలే ఎక్కువగా ప్రజలకు చేరువయ్యాని,మోడీ గారి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని,కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తల పై ఉందన్నారు.రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో బీజేపీ పార్టీ యువతకు పెద్దపీట వేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తుందని కాబట్టి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబెర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మండల నాయకులు వల్లే పార్వతలు, ఈర్ల నాగరాజు,సుధాగాని ప్రమోద్,దికొండ సునీల్ పాల్గొన్నారు.

Related posts

పార సీతయ్య మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా స్నేహితుల దినోత్సవం

Harish Hs

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TNR NEWS

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS

ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన- డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ 

TNR NEWS

కమ్యూనిస్టుల పోరాట ఫలితమే శ్రీరామ్ సాగర్ రెండవ దశ నిర్మాణం…  శ్రీరామ్ సాగర్ రెండవ దశకు మాజీ పార్లమెంటు సభ్యులు కమ్యూనిస్టు నేత భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలి.  రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు డిమాండ్

TNR NEWS