Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అట్టహాసంగా ప్రారంభమై లింగన్న గట్టుపై దేవర పెట్టే చేరుకోవడంతో దురాజ్ పల్లి జాతర జన సముద్రం అయింది. ఓ లింగా.. ఓ లింగా నామ స్మరణం తో గొల్ల గట్టు మారుమోగింది. సోమవారం గాంధీనగర్ ముద్దుబిడ్డ బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భక్త జనం బేరీలతో ర్యాలీ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు ఆంధ్ర బొబ్బిలి బోడె రామచందర్ యాదవ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం లకు బీసీల యువజన సంఘాల మహిళలు హారతులు ఇచ్చి యాదవుల సంప్రదాయ నాట్యాలతో స్వాగతం పలికారు. అనంతరం లింగమంతుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 *రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర..*

 

తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా సూర్యాపేట జిల్లా శ్రీ లింగమంతుల స్వామి(గొల్ల గట్టు) జాతర. కేసారం గ్రామం నుండి దేవర పెట్టే గుట్టపై చేరటంతో స్వామి వారి దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. గొల్ల గట్టు జాతర ఈనెల 16 నుండి ప్రారంభమై 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు కొనసాగనుంది.

Related posts

మూడవ జిల్లా మహాసభల కరపత్రాలు ఆవిష్కరణ

Harish Hs

విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించలేము  తెలంగాణ మధ్యాహ్న భోజన వర్కర్స్

TNR NEWS

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష విధానం గురించి అవగాహన – జిఎంఆర్ విద్యాసంస్థల రెస్పాండెంట్ వంటేరు గోపాల్ రెడ్డి

TNR NEWS

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాబా ప్రతి పాధకన ప్రకారం ఓసిలకు ప్రత్యేకంగా స్థానాలు కేటాయించి ఆయా స్థానాలలో కేవలం ఓసి లు మాత్రమే పోటీ చేసేలా చట్టం తేవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా విన్నవించిన. సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ వేమూరి సత్యనారాయణ.    

TNR NEWS

పాఠశాల వార్డెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన వరంగల్ జిల్లా కలెక్టర్

TNR NEWS