Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

బిసి ఉద్యమ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

సూర్యాపేట జిల్లాలోని శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అట్టహాసంగా ప్రారంభమై లింగన్న గట్టుపై దేవర పెట్టే చేరుకోవడంతో దురాజ్ పల్లి జాతర జన సముద్రం అయింది. ఓ లింగా.. ఓ లింగా నామ స్మరణం తో గొల్ల గట్టు మారుమోగింది. సోమవారం గాంధీనగర్ ముద్దుబిడ్డ బీసీ నాయకుడు వట్టే జానయ్య యాదవ్ ఆధ్వర్యంలో భక్త జనం బేరీలతో ర్యాలీ నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ముఖ్య అతిథులుగా బీసీ నాయకులు ఆంధ్ర బొబ్బిలి బోడె రామచందర్ యాదవ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, చిన్న శ్రీశైలం లకు బీసీల యువజన సంఘాల మహిళలు హారతులు ఇచ్చి యాదవుల సంప్రదాయ నాట్యాలతో స్వాగతం పలికారు. అనంతరం లింగమంతుల స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

 *రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర..*

 

తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర తరువాత రెండో అతిపెద్ద జాతరగా సూర్యాపేట జిల్లా శ్రీ లింగమంతుల స్వామి(గొల్ల గట్టు) జాతర. కేసారం గ్రామం నుండి దేవర పెట్టే గుట్టపై చేరటంతో స్వామి వారి దర్శనం కొరకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. గొల్ల గట్టు జాతర ఈనెల 16 నుండి ప్రారంభమై 20వ తేదీ వరకు ఐదు రోజులపాటు కొనసాగనుంది.

Related posts

సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్ తదితర అంశాల గురించి అవగాహన జిల్లా పరిషత్ హై స్కూల్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థులకు తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించుకొని ఇష్టంగా చదువుకోవాలి గజ్వేల్ షీ టీమ్ ఏఎస్ఐ శ్రీరాములు

TNR NEWS

మంత్రికి పాలాభిషేకం

TNR NEWS

తెలంగాణ తల్లి సోనియాగాంధీ…….  ఘనంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…

TNR NEWS

గ్రేటర్ హైదరాబాద్ తరహాలో ఆస్తి పన్ను వన్ టైం సెటిల్ మెంట్ రాయితీ ఇవ్వాలి.  సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్

TNR NEWS

తెలుగు రాష్ట్రాల నుండి శబరి కి ప్రత్యేక రైళ్లు

TNR NEWS

యాసంగి పంటకు సిద్ధమవుతున్న మహిళా రైతు  యాసంగి పంటకైనా బోనస్ త్వరగా ఇవ్వాలి  వానాకాల పంట బోనస్ అకౌంట్లో జమకాలేదు 

TNR NEWS