Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమే….  ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి 

సూర్యాపేట: మహిళల హక్కుల కై నిరంతరం పోరాటాలు చేసేది ఐద్వా మాత్రమేనని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి అన్నారు. బుధవారం అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా ) ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 23వ వార్డులో సంఘం జెండాను ఆమె ఆవిష్కరించి మాట్లాడుతూ అఖిలభారత ప్రజాతంత్రంమహిళా సంఘం 1981 మార్చి 10, 11, 12 తేదీల్లో అప్పటి మద్రాసు నగరం ఇప్పటి చెన్నై నగరంలో ఏర్పడిందన్నారు. అంతకుముందు అనేక రాష్ట్రాల్లో వివిధ పేర్లతో సంఘం పనిచేస్తూ వచ్చిందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం గా, పశ్చిమ బెంగాల్లో పశ్చిమబంగా గణతంత్ర మహిళా సమితిగా మహారాష్ట్రలో కామ్ గారు మహిళ సమితిగా అలా కేరళ ,తమిళనాడు పంజాబ్ అంటే అనేక రాష్ట్రాల్లో మహిళా సంఘం ఏర్పడి పనిచేస్తూ వచ్చిన సంగం 1981లో జరిగిన మొదటి మహాసభతో అఖిలభారతస్థాయి రూపం తీసుకుని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడిందని గుర్తు చేశారు. ఐద్వా దేశవ్యాప్తంగా పట్టణాల్లోనూ గ్రామాల్లోని మహిళలను సమకరించి మహిళల సమస్యల కోసం బలమైన మహిళా ఉద్యమాన్ని నిర్మించడం జరిగిందన్నారు. సమాజంలో అన్ని రకాల అణచివేతలను తొలగించడం కోసం మహిళా సంఘం పనిచేస్తుందని స్త్రీ, పురుషులకు సమానంగా అనేక హక్కులు సాధించింది మహిళా సంఘం అన్నారు. స్త్రీ లకు చట్టరీత్యా హక్కులున్నా స్త్రీలకు అందుబాటులో లేవు లేవన్నారు. అత్యాచారాలు, కుటుంబంలో హింస, బహుభార్యత్వం, బాలవివాహాలు,అధిక ధరలు ఇలా స్త్రీలను అనేక రకాల సమస్యలు ఉన్నాయని వాటికి వ్యతిరేకంగా ఐద్వా నిరంతరం పోరాడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు పిట్టల రాణి, శశిరేఖ, సైదమ్మ, నీరజ, శాలిని, ఆగమ్మ, ఉష రాణి, బిక్షవమ్మా తదితరు పాల్గొన్నారు

Related posts

తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

TNR NEWS

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల

TNR NEWS

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్.గవాయ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి -స్వేరోస్ సూర్యాపేట జిల్లా కోశాధికారి జిల్లపల్లి శివకృష్ణ

TNR NEWS

కుప్టీ ఘాటులో లారీ–బస్సు ఢీ : ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

TNR NEWS

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి  ధాన్యం తరరలింపులో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి  రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సాగర్ 

TNR NEWS