Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

వడ్డాది నుండి గంధవరం వరకు ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం పనులు కొద్దిరోజుల్లోనే ప్రారంభం

పిఠాపురం : దీర్ఘకాలిక సమస్య అయిన వడ్డాది నుండి  గంధవరం వరకు ఉన్న ఆర్ & బి రహదారి పునర్నిర్మాణం ఆలస్యం అవడం వలన క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ దృష్టికి  చోడవరం జనసేన పార్టీ ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్.రాజు తీసుకువెళ్లారు. అనకాపల్లి కార్యాలయంలో పార్లమెంటు సభ్యులను కలసి ఈ రహదారి దుస్థితి వలన ప్రజలు పడుతున్న ఇక్కట్లు, తరచు జరుగుతున్న ప్రమాదాలవలన అనేకమంది తీవ్ర గాయాలు పలగడం, ప్రాణాలు కోల్పోవడాన్ని వారి దృష్టికి తీసుకు వెళ్లారు. వెనువెంటనే సిఎం రమేష్ ఆర్ & బి శాఖ ఉన్నత అధికారులతోను మరియు కాంట్రాక్ట్ తీసుకొన్న కంపెనీ యజమాన్యంతోను సుధీర్గంగా చర్చించి వెంటనే రహదారి నిర్మాణం పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టు యాజమాన్యం రెండు వారాల్లో పనులు ప్రారింభిస్తామని తెలియచేసారు. ఈ ప్రధాన సమస్యపై ఎంతో శ్రద్ధ తీసుకుంటున్న సిఎం రమేష్ కి చోడవరం నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ కృతజ్ఞతలు తెలియచేస్తుందన్నారు. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు డి.పరమేశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

మా భూమి మాకు ఇప్పించండి మహాప్రభో – పొన్నాడ పంచాయతీ పాతదడాలపాలెం దళితలు

Dr Suneelkumar Yandra

వయోజన విద్యా సెంటర్స్ ప్రారంభోత్సవం

నల్లమల అడవుల్లో ప్రసిద్ధిచెందిన.. కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలి

Dr Suneelkumar Yandra

ఏపీకి దూసుకొస్తున్న ముప్పు.. రేపటి నుంచి వర్షాలు

TNR NEWS

శ్రీ దుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మర్రెడ్డి

Dr Suneelkumar Yandra

పిఠాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు