Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

నల్లమల అడవుల్లో ప్రసిద్ధిచెందిన.. కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలి

కాకినాడ : నల్లమల అడవుల్లో ఆధ్యాత్మిక దివ్యానుభూతి కలిగించే అవధూత కాశి నాయన జ్యోతి క్షేత్రాన్ని పరిరక్షించాలని కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ వ్రాసింది. నాలుగున్నర దశాబ్దాలుగా  ధార్మిక సేవలు జరుగుతున్న క్షేత్ర వైభవాన్ని భవిషత్తు తరాలకు అందించాలన్నారు. చరిత్ర పూర్వ నుండి దేశంలోని అనేక అటవీ ప్రాంతాల్లో అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలు వున్నాయని వాటి నియమాలు నిబంధన లు అమలు చేయడం ద్వారా కాశి నాయన క్షేత్రం కాపాడాలని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు కోరారు. అక్కడ వున్న 13హెక్టార్ల అటవీ భూమిని అటవీ చట్టం నుంచి మినహాయించాలని మాజీ ముఖ్య మంత్రులు కోట్ల విజయ భాస్కర రెడ్డి, ఎన్.టి.రామారావు హయాం నుండి కేంద్రాన్ని కోరుతున్న వినతిని ఆమోదించాలన్నారు. ఏకపక్షంగా క్షేత్రంలో జరుగుతున్న కూల్చివేతలను నిలుపుదల చేయాలన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఉచిత కంటి వైద్య శిబిరము పోస్టర్ ఆవిష్కరణ

బేడ (బుడ్గ) జంగం కులాన్ని ఎస్సీ వర్గీకరణలో చేర్చడం అభినందనీయం

Dr Suneelkumar Yandra

ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణుల సంరక్షణను బలోపేతం చేస్తుంది

Dr Suneelkumar Yandra

స్వయం ఉపాధి అవకాశాలపై ఉచిత శిక్షణ

Dr Suneelkumar Yandra

కాకినాడ కార్పోరేషన్ ప్రగతి పట్టాలెక్కించేదెప్పుడు

Dr Suneelkumar Yandra

ఉగ్రవాద దాడిలో మృతులకు జనసేన ఆధ్వర్యంలో మూడు రోజులపాటు సంతాప దినాలు

Dr Suneelkumar Yandra