Tnrnews.in
తెలంగాణ

వర్షాల పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ‌‌

మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ..ముఖ్యంగా వాహనదారులు, రైతులు, ప్రయాణికులు నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అన్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు,ముట్టుకోకుండా, అలాగే చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రయాణ సమయంలో రోడ్లు, వంతెనలు తెగిపోయిన రాకపోకలకు ఆటంకాలు ఎదురైతే పోలీస్ అధికారులకు తెలపాలని కోరారు. చెరువులు, వాగులు, కుంటలు, నీటితో నిండి ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహించినప్పుడు వాటిని దాటే సాహసం చేయరాదన్నారు.పాత పాడుబడ్డ ఇళ్లలో నివసించరాదని,బావుల వద్ద జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 100 కాల్ చేస్తే ప్రత్యేక సేవలు అందించేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉంటారని తెలిపారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

అర్హులకు అన్యాయం జరగదు.. • మండల ప్రజలకు కొప్పుల జైపాల్ రెడ్డి భరోసా

TNR NEWS

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వన్నె తేవాలి  పార్టీలో పని చేసే కార్యకర్తలను గుర్తిస్తాం   మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి తోనే కోదాడ అభివృద్ధి కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం

TNR NEWS

వెయ్యి గొంతులు లక్ష డప్పుల ప్రచార రథయాత్ర. ఈనెల 11న బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రారంభమై రథయాత్ర.  ఆదివారం నవాబ్ పెట్ మండలం మీదుగా  వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది.  మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

రైతులపై చవితి తల్లి ప్రేమ చూపెడుతున్న కేంద్ర ప్రభుత్వం

Harish Hs

కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఏఎంసి చైర్మన్

TNR NEWS