Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

 

టిఎన్ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

 

ప్రభుత్వ విద్యను ప్రజల హక్కుగా మలిచింది భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ నందు జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు.దేశానికి స్వాతంత్ర్యం అనంతరం తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా సమైక్య భారతావానికి ఎనలేని కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. విద్యార్థులు వారి ఆశయాల సాధనకై కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు జాకీర్ కార్యదర్శి అబ్దుల్ గఫార్,ఖాజా మియా, ఖన్నం సాహెబ్,జబ్బార్, ముక్తార్, శ్రీనివాస్ రెడ్డి,బడుగుల సైదులు, పాండురంగ చారి,బ్రహ్మచారి,దేవరాజ్, బ్రహ్మానందం,రామకృష్ణ, రవి, జానకి తదితరులు పాల్గొన్నారు………..

Related posts

ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో భవన నిర్మాణ కార్మికులకు మొదటి ప్రాధాన్యత కల్పించాలి 

TNR NEWS

పెద్దపల్లి లో బీఆర్ఎస్,సిపిఐ,బిజెపి నేతల ముందస్తు అరెస్టు..

TNR NEWS

ముత్యాలమ్మ ఆలయంలో అన్నదాన కార్యక్రమం 

TNR NEWS

సుధా బ్యాంక్ సేవలు అభినందనీయం………  సుధా బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే……..  ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…….

TNR NEWS

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్‌ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

TNR NEWS

గ్రామపంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచాలి నందరిని పర్మినెంట్ చెయ్యాలి

Harish Hs