Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

గిరిజన గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం

 

గిరిజన గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని డిప్యూటీ జనరల్ మేనేజర్ ట్రైకార్ బి.రవికుమార్ అన్నారు.శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని గిరీనగర్ ప్రభుత్వ గిరిజన బాలికల వసతిగృహం భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలలో భాగంగా బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. భగవాన్ బిర్సా ముండా 150 వ జయంతి సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధర్తీ అభ జన జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంను ప్రారంభించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో 954 గిరిజన గ్రామ పంచాయతీలను ఎంపిక చేసిన గ్రామపంచాయతీలకు అన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. సూర్యాపేట జిల్లాలోని 17 గిరిజన గ్రామ పంచాయతిలను ఎంపిక చేయడం జరిగిందని, ఇట్టి గ్రామాలలో 15 నవంబర్ 2024 నుండి 26 నవంబర్ 2024 వరకు గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ పంచాయతీలల్లో కల్పించవలసిన మౌలిక వసతుల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. రానున్న ఐదు సంవత్సరాలలో గ్రామపంచాయతీలను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె.శంకర్, రిటైర్డు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎల్.పాండు నాయక్, కార్యాలయ పరిపాలన అధికారి పి.శాంతి కుమార్, వార్డెన్లు గిరిధర్ రెడ్డి, కవిత, ఝాన్సీ, రాణి, జూనియర్ అసిస్టెంట్లు ఎస్. శ్రీనివాసులు, వి.ప్రియాంక, కార్యాలయ సిబ్బంది శివరాజు, నాగరాజు, సైదా నాయక్, సైదులు, లింగా నాయక్, దేవ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్

TNR NEWS

గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగం

Harish Hs

నిరుపేద వృద్ధులకు 50 దుప్పట్ల పంపిణీ*  *భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా* *వివేకానంద వాకర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో*

TNR NEWS

కాల్వశ్రీరాంపూర్ లో పెద్దమ్మతల్లి బోనాలు

TNR NEWS

పల్లెల్లో ప్రజలు ఐక్యంగా సంస్కృతి,సాంప్రదాయాలను కాపాడాలి…. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్…

TNR NEWS

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS