Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

సనాతన ధర్మంపై పిల్లలకు అవగాహన కల్పించాలి  …. జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి 

 

తల్లిదండ్రులు తమ పిల్లలకు సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి స్వామి సూచించారు. మెట్ పల్లి పట్టణంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని బుధవారం స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం భక్తులను ఉద్దేశించి స్వామి మాట్లాడారు. హిందు బంధువులంతా తమ పిల్లలకు ప్రతిరోజూ నుదుటన కుంకుమ పెట్టాలని, ఆడపిల్లల చేతులకు గాజులు తొడగాలని అన్నారు. ప్రతిరోజు సమీపంలోని ఏదో ఒక గుడికి వెళ్లి నమస్కరించేలా పిల్లలకు అలవాటు చేయాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి పిల్లలకు భక్తి భావాన్ని అలవాటు చేస్తే సనాతన ధర్మం పటిష్టంగా ఉంటుందని అన్నారు. సనాతన ధర్మం పాటించే పిల్లలు గురువుల పట్ల, పెద్దల పట్ల గౌరవభావం తో ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు ద్యావనపెల్లి రాజారాం, ఉపాధ్యక్షులు శంకు ఆనంద్, అన్నం నాగరాజు, గుంటుక గౌతమ్, భీమనాథ్ సత్యనారాయణ, భాస్కర్, పట్టణంలోని పద్మశాలి వార్డు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.

Related posts

అయ్యప్ప దేవాలయం లో అయ్యప్ప స్వామికి నెయ్యితో అభిషేకం 

TNR NEWS

కేజీబివిలో గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం

TNR NEWS

హైదరాబాదులో జరిగే మాలల సింహ గర్జన సభను జయప్రదం చేయండి..  జాతీయ తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పరుస వెంకటేష్ పిలుపు..

TNR NEWS

సాంస్కృతిక కార్యక్రమాలతో మానసిక ఒత్తిడి దూరం  ….. కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్

TNR NEWS

సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం

Harish Hs

పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక…. జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభలో, ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి…… అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు….. వేపాలసింగారం ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS