Tnrnews.in
తెలంగాణ

భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పిడమర్తి మధు టపాసు దుకాణదారులకు అధికారులు,ప్రజలు సహకరించాలి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణాలకు గాను భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా పిడమర్తి మధు, గౌరవ సలహాదారులుగా పాలవరపు రాజేష్,ధార పూర్ణచందర్, ఉపాధ్యక్షులుగా జన్నపాల రాహుల్, కార్యదర్శిగా పోలోజు వినయ్, సహయ కార్యదర్శిగా మాచర్ల ఉపేందర్, కోశాధికారిగా శిల్ప అజయ్, సహాయ కోశాధికారిగా కోసూరి సందీప్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పిడమర్తి మధు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించుకున్నామన్నారు. అధికారులు సూచించిన స్థలంలో కాకుండా బయట ఎవరైనా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే అధికారులు తగిన చర్యలు తీసుకొని తమకు సహకరించాలని కోరారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు టపాసులను అధికారులు నిర్ణయించిన స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణదారుల వద్దనే కొనుగోలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మదర్ థెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Harish Hs

సూర్యాపేట జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలన సదస్సు

TNR NEWS

ఇండియన్ బ్యాంక్ వారి తో సమావేశం నిర్వహించిన.. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్

TNR NEWS

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది

TNR NEWS

విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడితే జైల్ ఊచలు లెక్క పెట్టాల్సిందే

Harish Hs

స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్దత పై సమీక్ష.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలి…జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TNR NEWS