Tnrnews.in
తెలంగాణ

భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా పిడమర్తి మధు టపాసు దుకాణదారులకు అధికారులు,ప్రజలు సహకరించాలి

సూర్యాపేట జిల్లా కేంద్రంలో దీపావళి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయనున్న టపాసుల దుకాణాలకు గాను భానుపురి క్రాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులుగా పిడమర్తి మధు, గౌరవ సలహాదారులుగా పాలవరపు రాజేష్,ధార పూర్ణచందర్, ఉపాధ్యక్షులుగా జన్నపాల రాహుల్, కార్యదర్శిగా పోలోజు వినయ్, సహయ కార్యదర్శిగా మాచర్ల ఉపేందర్, కోశాధికారిగా శిల్ప అజయ్, సహాయ కోశాధికారిగా కోసూరి సందీప్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు పిడమర్తి మధు మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అధికారులు చెప్పిన స్థలంలో నిబంధనలకు లోబడి దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించుకున్నామన్నారు. అధికారులు సూచించిన స్థలంలో కాకుండా బయట ఎవరైనా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తే అధికారులు తగిన చర్యలు తీసుకొని తమకు సహకరించాలని కోరారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు టపాసులను అధికారులు నిర్ణయించిన స్థలంలో ఏర్పాటు చేసిన దుకాణదారుల వద్దనే కొనుగోలు చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి

TNR NEWS

అఖిలపక్ష సమావేశం

Harish Hs

జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి

Harish Hs

భీముని పాదం జలపాతాన్ని అభివృధి కి సహకరిస్తా జాతీయ ఎస్టి కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్

TNR NEWS

సంత అభివృద్ధికి కృషి

Harish Hs

రైతులకు లాభసాటి పంటలపై అవగాహన కల్పించాలి: జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

TNR NEWS