కాగజ్నగర్లో గల తెలంగాణ మాల మహానాడు కార్యాలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు, పరుస వెంకటేష్ మరియు కార్యదర్శి తౌటి తిరుపతి మాట్లాడుతూ డిసెంబర్ 1న సికింద్రాబాద్ లోని పెరడ్ గ్రౌండ్లో నిర్వహించే మాలల సింహ గర్జన సభకు కొమరం ఆసిఫాబాద్ జిల్లాలో నుండి మాల సోదరులందరూ ప్రతి ఒక్క మండలం నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి మాల సోదర సోదరీమణులు అందరు అధిక సంఖ్యలో తరలి రావాలని ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో సలహాదారులు రెడ్డి గోపి, వర్కింగ్ ప్రెిడెంట్ మొగిలి వెంకటేష్, ఉపాధ్యక్షులు, ఎడ్ల శ్రీనివాస్, కోశాధికారి జూపాక చందు, సంయుక్త కార్యదర్శి కడారి శ్రీనివాస్, మరియు జై భీమ్ సైనిక్ దళ్ సభ్యులు,పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
