Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*ఓ ప్రజా ప్రతినిధి దివ్యాంగుని పై దాడి* ★ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ★ ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ★వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రాధిక డిమాండ్,

మద్దూర్ డిసెంబర్ 02(TNR NEWS) : మండల పరిధిలోని ఓ ప్రజా ప్రతినిధి దివ్యంగునిపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నంది పహాడ్ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన గుర్రల్లి నరేష్ తండ్రి అంజిలప్ప పై అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి దాడి ఘటనపై దివ్యాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు రాధిక తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 100% కళ్ళు కనిపించని దివ్యగుడైన నరేష్ పై ఇంత దారుణంగా దాడి చేయడం సభబు కాదని ఈ దారుణానికి పాల్పడిన మాజీ ప్రజా ప్రతినిధి, ప్రజ సమస్యలను పరిష్కరించే బాధ్యత కలిగిన ఎంపీటీసీ గా పనిచేసిన వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కావున అధికారులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి బాధితుడికి నాయ్యం చేకూరేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. లేనియెడల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Related posts

చెరువుల మరమత్తుల పనులకు భూమి పూజ

TNR NEWS

డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత పని చేయాలి

TNR NEWS

సంప్రదాయ పంటల నుండి చియా వైపు రైతులు చియా సాగు వైపు ఆకర్షితులు ప్రభుత్వ మద్దతు అవసరం తక్కువ ఖర్చుతో అధిక లాభం

TNR NEWS

మునగాల మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో పొగ మంచు

Harish Hs

సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయం………  ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే…..  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి……..

TNR NEWS

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలి

TNR NEWS