Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*ఓ ప్రజా ప్రతినిధి దివ్యాంగుని పై దాడి* ★ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ★ ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ★వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రాధిక డిమాండ్,

మద్దూర్ డిసెంబర్ 02(TNR NEWS) : మండల పరిధిలోని ఓ ప్రజా ప్రతినిధి దివ్యంగునిపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నంది పహాడ్ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన గుర్రల్లి నరేష్ తండ్రి అంజిలప్ప పై అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి దాడి ఘటనపై దివ్యాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు రాధిక తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 100% కళ్ళు కనిపించని దివ్యగుడైన నరేష్ పై ఇంత దారుణంగా దాడి చేయడం సభబు కాదని ఈ దారుణానికి పాల్పడిన మాజీ ప్రజా ప్రతినిధి, ప్రజ సమస్యలను పరిష్కరించే బాధ్యత కలిగిన ఎంపీటీసీ గా పనిచేసిన వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కావున అధికారులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి బాధితుడికి నాయ్యం చేకూరేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. లేనియెడల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Related posts

తెలంగాణ జర్నలిస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి షాక్‌ ! – కొనసాగుతున్న సమీక్ష సమావేశం  – మళ్ళీ అధికారంలోకి వస్తేనే ఇండ్ల స్థలాలు  – ఇప్పట్లో ఇచ్చేది లేదంటూ పరోక్షంగా వెల్లడి

TNR NEWS

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

Harish Hs

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

Harish Hs

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

Harish Hs

పోలీసులకు, ఉద్యమకారుల మధ్య  తోపులాట…  ఉద్రిక్తం…  ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకుల అక్రమ అరెస్టు, విడుదల  అనుమతులన్నింటినీ రద్దు చేసేంతవరకుఐక్యంగా ఉద్యమిస్తాం … ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ నేతలపిలుపు….

TNR NEWS

పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

TNR NEWS