Tnrnews.in
తెలంగాణ

*ఓ ప్రజా ప్రతినిధి దివ్యాంగుని పై దాడి* ★ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు. ★ ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ★వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షురాలు రాధిక డిమాండ్,

మద్దూర్ డిసెంబర్ 02(TNR NEWS) : మండల పరిధిలోని ఓ ప్రజా ప్రతినిధి దివ్యంగునిపై దాడికి పాల్పడ్డాడని బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం నంది పహాడ్ గ్రామ పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన గుర్రల్లి నరేష్ తండ్రి అంజిలప్ప పై అదే గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి దాడి ఘటనపై దివ్యాంగుల హక్కుల జాతీయ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షురాలు రాధిక తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 100% కళ్ళు కనిపించని దివ్యగుడైన నరేష్ పై ఇంత దారుణంగా దాడి చేయడం సభబు కాదని ఈ దారుణానికి పాల్పడిన మాజీ ప్రజా ప్రతినిధి, ప్రజ సమస్యలను పరిష్కరించే బాధ్యత కలిగిన ఎంపీటీసీ గా పనిచేసిన వ్యక్తే ఇలాంటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. కావున అధికారులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి బాధితుడికి నాయ్యం చేకూరేలా చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. లేనియెడల వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

TNR NEWS

వెంకట్రామ పురం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కీ త రమేష్ 

TNR NEWS

మునగాల సర్వీస్ రోడ్డు, గణపవరం రహదారిపై దుమ్ములేకుండా చర్యలు తీసుకోవాలి కోదాడ ఆర్డిఓకు వినతిపత్రం అందజేసిన మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సామాజిక కార్యకర్త గంధం సైదులు

TNR NEWS

సుధా బ్యాంక్ సేవలు అభినందనీయం………  సుధా బ్యాంక్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే……..  ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి…….

TNR NEWS

రాష్ట్రస్థాయిలో కోదాడ శ్రీ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

TNR NEWS

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

TNR NEWS