కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో గురువారం తీయ జనతా పార్టీ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎఐసిసి నాయకులు అయినటువంటి మల్లికార్జున కరిగే భారతదేశంలో జరుగుతున్న మహాకుంభమేళాను కించపరుస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ హిందువుల మనోభావాలను కించపరస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు హిందువులు పవిత్రంగా విశ్వసించే మహా కుంభమేళపై మల్లికార్జున్ కార్గే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడంతో మండల కేంద్రంలో మల్లికార్జున్ కార్గే దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. హిందూ సమాజం అన్ని మతాల వర్గాల వారికి గౌరవం ప్రాధాన్యతిస్తుందని. అలాంటి హిందూ మతాన్ని, మత సాంప్రదాయాలను అగౌరపరిస్తే పుట్టగతులు ఉండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తేప్పావా తుకారం డిస్టిక్ సెక్రెటరీ కృష్ణ పటేల్ ఓబీసీ జుక్కల్ కాన్స్టెన్సీ కన్వీనర్ సంతోష్ తులవర్ బాలకిషన్ కంచన్ యాదవ్ మండల యూత్ ప్రెసిడెంట్ గడ్డి వార్ తుకారాం శంకురంజన్న గోపన్ శివాజీ రాజు తమేవార్ మరియు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
