Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రామానంద తీర్థ చైర్మన్ ను సన్మానించిన ఓయూ పూర్వ విద్యార్థులు 

స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ గా ఓయూ ప్రొఫెసర్ నారా కిషోర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలోని రామానంద తీర్థ గ్రామీణ సంస్థ లో శుక్రవారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. పదవి స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఓయూ పూర్వ విద్యార్థులు పర్శరాములు, ప్రేమ్ కుమార్, మంగన్న, కోటి రెడ్డి, ఎల్ రాంరెడ్డి, బండ నర్సింలు, డీ చంద్రయ్య హాజరై కిషోర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను సంస్థ చైర్మన్ గా నియమించిన సిఎం రెవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన బాధ్యతలను క్రమశిక్షణతో నిర్వర్తిస్తానని తెలిపారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని ప్రకటించారు. సంస్థ ఇచ్చే శిక్షణ తరగతులను పేద నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Related posts

కనీస వేతనం ఇవ్వాలి, మల్టీపర్పస్ విధానం రద్దుచెయ్యాలి. 17న చలో హైదరాబాద్ జయప్రదం చేయండి..     సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు..

TNR NEWS

*తెలంగాణ ఉద్యమకారులకు ప్రశంస పత్రాల పంపిణీ*

TNR NEWS

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

TNR NEWS

ఇక డిగ్రీ రెండున్నరేళ్లే.. వచ్చే ఏడాది నుంచి అమలు: UGC చైర్మన్

TNR NEWS

సమర్థవంతంగా సర్వే చేయాలి

Harish Hs

సుబ్బరామయ్య సేవలు చిరస్మరణీయం…..  కోదాడ అభివృద్ధిలో సుబ్బరామయ్య చేసిన కృషి అభినందనీయం……..  కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు…..

TNR NEWS