Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలి

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, విద్యార్థులు భోజనం చేసే గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు.శనివారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ ను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న కూరగాయలు, బియ్యం, ఇతరత్రా సామాన్లను పరిశీలించారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పరిశుభ్రమైన త్రాగు నీరు అందించాలని అన్నారు. విద్యార్థులకు వేడివేడి ఆహార పదార్థాలను అందించాలని సూచించారు.ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పిస్తుందని వీటిని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, పాల్గొన్నారు.

Related posts

వృద్ధాశ్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే

TNR NEWS

పతంగుల కోసం చైనా మాంజా వాడకం ప్రమాదకరం‌

Harish Hs

ఎస్బీఐ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్  తలసేమియా బాధితులకు అండగా ఎస్బీఐ ఉద్యోగులు

TNR NEWS

ఓదార్చి వస్తుండగా అనంతలోకానికి వెనకనుంచి అతివేగంగా వచ్చి ఢీ కొట్టిన లారీ ఒకరు మృతి ఒకరికి తీవ్ర గాయాలు

TNR NEWS

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

TNR NEWS

గ్రామ సభలకు కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు మాజీ ఎంఎల్ఏ పెద్ది సుదర్శన్ రెడ్డి 

TNR NEWS