Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

దుకాణ సముదాయాలు, గోదాములను ప్రారంభించిన మంత్రి

చేవెళ్ల మండల కేంద్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన దుకాణాల సముదాయం మరియు గోదాములను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ప్రారంభించారు. డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, స్థానిక నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గోదాములను రైతులు వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇంచార్జ్ భీం భరత్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సున్నపు వసంతం‌, ఆగిరెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, గోనే ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ రాములు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రభాకర్, కాంగ్రెస్ యువజన నాయకులు మద్దెల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

*సర్పంచ్, కార్యదర్శికి మళ్లీ జాయింట్ చెక్ పవర్?..ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసే చాన్స్..!!* ఉప సర్పంచ్కు చెక్ పవర్ తొలగించే యోచనలో సర్కారు వరుసగా రెండు టర్మ్ల రిజర్వేషన్ ను రద్దుచేసే చాన్స్ అభ్యర్థులకు ఇద్దరు పిల్లలకు మించి ఉండరాదనే నిబంధన కూడా ఎత్తివేత! పంచాయతీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం కసరత్తు

TNR NEWS

ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలి. వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. దిశ చైర్మన్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి.

TNR NEWS

ప్రజా ఆరోగ్యాలకు తీవ్ర నష్టం కలిగించేఇథానాల్ ఫ్యాక్టరీని ఎత్తి వేసే వరకు ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలి.  తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీరాష్ట్ర కన్వీనర్ కన్నెగంటి రవి

TNR NEWS

శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

TNR NEWS

గ్రంథాలయానికి తాత్కాలి క మరమ్మతులు

Harish Hs

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Harish Hs