Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని బుధవారం మునగాల మండల కేంద్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మునగాల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అండర్పాస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. గ్యాస్ బండపై పెంచిన 50 రూపాయలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దేవరం వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ధరలు తగ్గించేంత వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటాల నిర్వహిస్తామన్నారు వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచడం వలన ప్రస్తుతం ఉన్న 876 నుండి 905 రూపాయలకు పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజల పై అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలపై అధికభారాలు పడతాయన్నారు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దానికి అనుగుణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాల్సిన మోడీ ప్రభుత్వం ఆయిల్ కంపెనీల లాభాల కోసం ప్రజలపై భారాలు మోపుతుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శిలు వెంకన్న గడ్డం వినోద్ బోళ్ళ మంగారెడ్డి ఉప్పల పిచ్చమ్మ లవంగి గోపాలం తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర స్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల విద్యార్థులు 

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS

ఘనంగా సిపిఐ పార్టీ ఆవిర్భావదినోత్సవం వేడుకలు  – త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర ఎర్రజెండాది – శివలింగ కృష్ణ గజ్వేల్ నియోజకవర్గం సిపిఐ పార్టీ కార్యదర్శి 

TNR NEWS

శ్రీకాంత్ చారి ఆశయాలను సాధించాలి 

TNR NEWS

యలక రత్తమ్మ మృతికి నివాళులర్పించిన జర్నలిస్టులు సూర్యాపేటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ యలక రా మిరెడ్డి తల్లిగారు, టిఆర్ఎస్ నాయకులు

TNR NEWS

అనసూర్యమ్మ మరణం బాధాకరం… సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు…

TNR NEWS