Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బుధవారం మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ. 50 లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ, సబ్సిడీ యేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ భయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉపాధి పెంచి ధరలను తగ్గించాల్సింది పోయి,కేంద్రం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నదని విమర్శించారు. వెంటనే కేంద్రం గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50 రూపాయలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వీరబోయిన వెంకన్న,సింగిల్ విండో డైరెక్టర్ వెంపటి వీరబ్రహ్మం,ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఖాజాబీ,సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిలు, భూతం వెంకన్న,దైద సైదులు, డివైఎఫ్ఐ నాయకులు షేక్ ఖాదర్, డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్షుడు దాసరి గురవయ్య, కార్యదర్శి వెంపటి స్టాలిన్,పార్టీ సభ్యులు కోడి వెంకన్న,కోడి లింగరాజు,నబి సాహెబ్, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థులకు గణిత ప్రతిభా పరీక్షలు

TNR NEWS

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు

TNR NEWS

ద్విచక్ర వాహనం పట్టివేత

TNR NEWS

పొలంలో ట్రాక్టర్ బోల్తా పడి యువ రైతు మృతి ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్సై

TNR NEWS

ఘనంగా హోలీ సంబరాలు

TNR NEWS

ఏ బస్సు చూసిన కాలేశ్వర పుష్కరాళ్లకే         మంథని బస్టాండ్ లో ప్రయాణికులు ఇబ్బంది ఉచితలకు అలవాటు పడ్డ ప్రజలు

TNR NEWS