Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా బుధవారం మునగాల మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై రూ. 50 లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ, సబ్సిడీ యేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడనున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ భయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉపాధి పెంచి ధరలను తగ్గించాల్సింది పోయి,కేంద్రం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నదని విమర్శించారు. వెంటనే కేంద్రం గ్యాస్ సిలిండర్ పై పెంచిన 50 రూపాయలను తగ్గించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వీరబోయిన వెంకన్న,సింగిల్ విండో డైరెక్టర్ వెంపటి వీరబ్రహ్మం,ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు షేక్ ఖాజాబీ,సిపిఎం పార్టీ గ్రామశాఖ కార్యదర్శిలు, భూతం వెంకన్న,దైద సైదులు, డివైఎఫ్ఐ నాయకులు షేక్ ఖాదర్, డివైఎఫ్ఐ గ్రామ అధ్యక్షుడు దాసరి గురవయ్య, కార్యదర్శి వెంపటి స్టాలిన్,పార్టీ సభ్యులు కోడి వెంకన్న,కోడి లింగరాజు,నబి సాహెబ్, గ్రామ మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Related posts

రఘు కుటుంబాన్ని పరామర్శించిన, ఎంజెఎఫ్ జాతీయ అధ్యక్షుడు దాసు

TNR NEWS

నేటి నుండి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు

Harish Hs

సెయింట్ థెరీసా స్కూల్లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు బడుగు బలహీన విద్యార్థులకు విద్యను అందిస్తున్న మిషనరీ సంస్థ పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 

TNR NEWS

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పొనుగోటి రంగా ఎన్నిక 

TNR NEWS

ఉపాధికార్డులున్న కూలీలందరికీ ఇందిరమ్మ భరోసా కింద 12000 ఇవ్వాలి.          పంజాల రమేష్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు 

TNR NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS