Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

నేడు మునగాల లో భూ భారతి చట్టం పై అవగాహన సదస్సు అధిక సంఖ్యలో రైతులు హాజరు కావాలి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల మేలు కొరకు అమలు చేసిన భూ భారతి చట్టంపై నిర్వహిస్తున్న సదస్సుకు మండల వ్యాప్తంగా ఉన్న రైతులు హాజరుకావాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు చెందిన వ్యవసాయ భూ సమస్యలను ఆన్లైన్ ద్వారా సులుభ పద్ధతిలో పరిష్కరించే మార్గంపై మండల కేంద్రంలోని నేడు శుక్రవారం స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో నిర్వహించే భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ నందులాల్ పవార్ హాజరై క్లుప్తంగా వివరించనున్నారు కావున ఇట్టి సదస్సు కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Related posts

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముకుందాపురం బస్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి

Harish Hs

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత ఇదే

TNR NEWS

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలి

TNR NEWS

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మొదటి సంత్సరము విద్యార్థీ హత్మహత్య

TNR NEWS

చేర్యాలను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కు తరలిన జేఏసీ నాయకులు

TNR NEWS

కొనసాగుతున్న డేటా ఎంట్రీ నమోదు : ఎంపీడీవో నర్సింహారెడ్డి 

TNR NEWS