Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ముకుందాపురం బస్టాండ్ వద్ద అండర్ పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలి

ఆదివారం నాడు హైదరాబాదు నుండి విజయవాడ వెళుతున్న ఇన్నోవా వాహనం మునగాల మండలం ముకుందాపురం బస్టాండ్ వద్ద ఎ క్లాస్ కన్ పేట తండవాసి, నడిగూడెం మాజీ సింగిల్ విండో డైరెక్టర్ సేవ్యా, ద్విచక్ర వాహనం మీద వెళ్తూ కూరగాయలు అమ్ముకునేందుకు వెళ్తున్న సందర్భంలో ఇన్నోవా వాహనం ఢీకొని బానోతు సేవ్యా అక్కడికక్కడే దుర్మరణం చెందడం చాలా బాధాకరమని ఇప్పటివరకు ఆ ప్రాంతంలో 40 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి అక్కడ అండర్ పాస్ నిర్మించాలని కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. చనిపోయిన సేవ్యా పార్దివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో ఎస్ఎస్ రావు, పలువురు బంధువులు, గ్రామస్తులు ఉన్నారు.

Related posts

ఎల్ ఓ సీ అందచేసిన స్పీకర్.

TNR NEWS

కోదాడ లో మొట్ట మొదటి మల్టీ బ్రాండ్ ఆఫ్టికల్ స్టోర్ సిటి ఆప్టికల్స్

Harish Hs

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం 

TNR NEWS

నవజీవన్ ఎక్స్ ప్రెస్ తిరిగి పెద్దపల్లి రైల్వే స్టేషన్ జంక్షన్లో నిలుపుదల చేయాలి.. దక్షిణ మధ్య రైల్వే డివిజన్ మేనేజర్ సికింద్రాబాద్ వారికి వినతి.. –డి.ఆర్.యు.సి.సి రైల్వే కమిటీ మెంబర్ ఎన్డి .తివారి..

TNR NEWS

కోదాడ షీ టీం ఎస్సైగా మల్లేష్ బాధ్యతలు స్వీకరణ

TNR NEWS

నేడు మున్నూరు కాపు సభను విజయవంతం చేయాలి

TNR NEWS