పాకిస్తాన్లోని ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర ఘటన చారిత్రాత్మకమని విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఎంవి రెడ్డి బురి రామయ్యలు పేర్కొన్నారు సోమవారం హైదరాబాదులో చైతన్యపురి అపోలో కాన్ఫరెన్స్ హాల్లో కోదాడ ప్రవాసఆత్మీయ సమితి. సెల్యూట్ టు సోల్జర్స్ పేరుతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు… దేశ భద్రత రక్షణలో త్రివిధ దళాలు నిబద్దతతో పనిచేసేయని వారి సేవలను గుర్తించాలన్నారు.. ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న మేజర్ సాయి భార్గవ్ తన అనుభవాలను వివరిస్తూ పాకిస్తాన్ డ్రోన్లను ఎలా తిప్పి కొట్టామో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఆర్మీ అధికారులు స్వర్ణ రెడ్డి స్వామి నరసింహారెడ్డి రామనాథం సుదర్శన్ దయాకర్ రెడ్డి నరసయ్యలను ఘనంగా సత్కరించారు.. సంఘోజు నాగాచారి అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో అపోలో అకాడమీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రిన్సిపల్ మధుసూదన్ చైతన్యపురి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు కోదాడ ఆర్పీఎస్ సమితి సభ్యులు అంజయ్య శ్రీనివాస్ కళింగరావు సతీష్ వెంకటేశ్వరరావు నారాయణరావు శ్యాంప్రసాద్ పాల్గొన్నారు…..