Tnrnews.in
తెలంగాణ

ప్రతి ఒకరు సేవాగుణం అలవర్చుకోవాలి

పెన్నులు పంపిణీ చేస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు మునగాల : ప్రతి ఒక్కరు సేవా గుణాన్ని అలవాటు చేసుకోవాలని మునగాల మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు అన్నారు. సోమవారం చేయూత ఆధ్వర్యంలో నిర్వాహకులు గోపి పుట్టినరోజు సందర్భంగా మునగాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు స్వీట్లు పంపిణీ చేయడంతో పాటు అనాధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వ్యక్తి తన సంపాదించిన దానిలో పేదల కోసం ఎంతో కొంత విచ్చించాలన్నారు. పదిమందికి సాయం చేసినప్పుడే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. కోట్లు సంపాదించిన రాణి తృప్తి పదిమందికి చేసిన సహాయం లోనే లభిస్తుందన్నారు. చేయూత ఆధ్వర్యంలో ప్రతినెల పేదవారికి ఏదో ఒక రూపంలో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన యువజన సంఘాలు, యూత్ నిర్వాహకులు పేదలకు ఎంతో కొంత సహాయం చేసేందుకు ముందుకు రావాలి అన్నారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చేయూత నిర్వాహకులు గోపి, సతీష్, దిలీప్, రాజ్ కమల్, పవన్, సూర్య, ప్రసన్న, దీపక్, వంశీ, ప్రదీప్, నవీన్, పండు తదితరు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎజెండా  సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు

TNR NEWS

గ్రూప్ 3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Harish Hs

కామదేను 2024 అవార్డు  

TNR NEWS

పంది తిరపయ్యకు పితృవియోగం

Harish Hs

మహిళా దినోత్సవం సందర్భంగా రూరల్ సీఐ రజిత రెడ్డికి అభినందనలు

Harish Hs

సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ

TNR NEWS