November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని తాళ్ల గడ్డ కు చెందిన రాపర్తి మల్సూర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుమారుడైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాపర్తి రమేష్ గౌడ్ లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పరామర్శించారు. అలాగే ఇటీవల కక్కిరేణి శివకుమార్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాపర్తి మల్సూర్ గౌడ్ చనిపోవడం బాధాకరమన్నారు. అలాగే యువకుడిగా ఉన్న కక్కిరేణి శివకుమార్ చిన్నతనంలో చనిపోవడం బాధాకరమని అన్నారు. వీరి ఇద్దరి మరణం ఆ కుటుంబ సభ్యులను శోకసముద్రంలో నెట్టి వేసింది అన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు.ఆమె వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పాల్గొన్నారు.

Related posts

పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

TNR NEWS

అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమిద్దాం – పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్

TNR NEWS

అక్రమంగా 34 గోవులను తరలింపు పట్టుకున్న భజరంగ్ దళ్ శ్రేణులు..గోవులను పోలీస్ స్టేషన్ కి తరలించారు

TNR NEWS

తెలంగాణ నేటి నుంచే గ్రూప్ 3 పరీక్షలు.. పాటించాల్సిన రూల్స్ ఇవే..!!

TNR NEWS

సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమ్మె

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు 

TNR NEWS