Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

సూర్యాపేట: సూర్యాపేట పట్టణంలోని తాళ్ల గడ్డ కు చెందిన రాపర్తి మల్సూర్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. దీంతో వారి కుమారుడైన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, రాపర్తి రమేష్ గౌడ్ లను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి పరామర్శించారు. అలాగే ఇటీవల కక్కిరేణి శివకుమార్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు కక్కిరేణి సత్యనారాయణ ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాపర్తి మల్సూర్ గౌడ్ చనిపోవడం బాధాకరమన్నారు. అలాగే యువకుడిగా ఉన్న కక్కిరేణి శివకుమార్ చిన్నతనంలో చనిపోవడం బాధాకరమని అన్నారు. వీరి ఇద్దరి మరణం ఆ కుటుంబ సభ్యులను శోకసముద్రంలో నెట్టి వేసింది అన్నారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు.ఆమె వెంట సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పాల్గొన్నారు.

Related posts

ఐదేళ్ళలో కోటిమందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ రామ్మూర్తియాదవ్*… *కాంగ్రెస్ విజయోత్సవ సభకు వరంగల్ తరలిన కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

TNR NEWS

ఐఎంఏ అధ్యక్షులు గంగాసాగర్ కు సన్మానం 

TNR NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS

రాఘవేంద్ర పాఠశాలలో బోనాల సంబరాలు

TNR NEWS

దారూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి.

TNR NEWS