Tnrnews.in
తెలంగాణ

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

కోదాడ పట్టణంలోని మున్సిపాలిటీ పక్కన గల మండపం ఏరియా బడ్డీ కోట్లను తొలగించాలంటూ పేద చిరు వ్యాపారులను మున్సిపాలిటీ అధికారులు ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బడ్డీ కొట్ల దుకాణదారుల సంఘం అధ్యక్షులు షేక్ నయీమ్, గౌరవ అధ్యక్షులు బొలిశెట్టి కృష్ణయ్యలు అన్నారు. బుధవారం మండపం ఏరియాలోని చిరు వ్యాపారులతో కలిసి ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత 40 సంవత్సరాలుగా చిరు వ్యాపారులు బడ్డీ కోట్ల ను వేసుకొని మున్సిపాలిటీకి పన్నులు కడుతూ ఉపాధి పొందుతున్నారని గతంలో అనేకమంది స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన దురాక్రమణ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారని అన్నారు. డబ్బా కొట్లను తొలగించి పేదల జీవనం మీద పొట్ట కొట్ట వద్దన్నారు. మున్సిపాలిటీ అధికారులు పేద చిరు వ్యాపారులను వేధించడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో కర్ల సుందర్ బాబు, షేక్ దస్తగిరి, రాజు, సైదులు, సింహాచలం, రావుఫ్, సైదులు, మౌలానా, మహమ్మద్, అబ్దుల్ రహీం, కృష్ణకుమారి,రాంబాబు,హుస్సేన్ బి, దస్తగిరి, గోపాలకృష్ణ, రాజు, నరహరి, ముస్తఫా, ఆరిఫ్,లక్ష్మీ,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు…

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

Harish Hs

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి  ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి, దాసరి ప్రశాంత్  ఎస్ఎఫ్ఐ, సమగ్ర శిక్షణ ఉద్యోగులు తో సిద్దిపేట కలెక్టరేట్ ఎదురుగా ధర్నా

TNR NEWS

వర్గీకరణ అమలుకై ఐక్యంగా పోరాడుదాం

Harish Hs

విద్యుదాఘాతంతో రైతు మృతి

Harish Hs

తెలంగాణ లో బీసీలకు 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు కాకపోవడానికి ప్రధాన కారణం బిజెపి  బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలుకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి – బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి  – సొంత నిధులతో మండల కేంద్రంలో నూతన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ 

TNR NEWS