Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!  పరకాల ఏసీపీ సతీష్ బాబు

విద్యార్థులు మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని పరకాల ఏసిపి సతీష్ బాబు గెలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరీస్సా పాఠశాలలో మాదకద్రవ్యాల డ్రగ్స్ నిర్మూలన పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలైన గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపైన లఘు చిత్రం ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించారు. అనంతరం ఏసిపి సతీష్ బాబు మాట్లాడుతూ ఇటీవల కాలంగా యువత దుర్ వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు స్నేహాలు చేయకూడదని డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడిన, అమ్మిన వాడమని ప్రోత్సహించిన వారి వివరాలను తెలియజేయాలని ఆయన తెలిపారు. తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యార్థి దశలో చక్కటి ప్రణాళిక బద్ధంగా చదువులను కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు క్రమశిక్షణ విద్యార్థుల అవసరమని క్రమశిక్షణతోనే విద్యాభ్యాసం జరగాలన్నారు అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో సీఐ ఆర్ సంతోష్ ఎస్సై తిరుపతి సెయింట్ థెరిస్సా పాఠశాల ప్రిన్సిపల్ జాయిస్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Related posts

బి.యన్.రెడ్డి పోరాట ఫలితమే శ్రీరాంసాగర్ రెండో దశ  ఎంసిపిఐ యు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరి కుప్పల వెంకన్న  జిల్లా కార్యదర్శి షేక్ నజీర్

TNR NEWS

చిరు వ్యాపారులకు అండగా ఉంటాం

Harish Hs

బీఎస్పీ సెంట్రల్ కోఆర్డినేటర్ గా అడ్వకేట్ నిసాని రామచంద్రం  

TNR NEWS

రాష్ట్రస్థాయి చెస్ అండర్ 13 కి ఎంపికైన జిల్లేపల్లి శ్యాముల్

TNR NEWS

తమ్మర లో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కోదాడ మండల నాలుగో మహాసభ

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs