Tnrnews.in
తెలంగాణ

విద్యార్థులు మాదక,ద్రవ్యాల మత్తులో పడవద్దు!  పరకాల ఏసీపీ సతీష్ బాబు

విద్యార్థులు మాదకద్రవ్యాల మత్తులో చిక్కుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దని పరకాల ఏసిపి సతీష్ బాబు గెలుపునిచ్చారు. బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని సెయింట్ థెరీస్సా పాఠశాలలో మాదకద్రవ్యాల డ్రగ్స్ నిర్మూలన పైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాలైన గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపైన లఘు చిత్రం ద్వారా విద్యార్థులకు అవగాహన కలిగించారు. అనంతరం ఏసిపి సతీష్ బాబు మాట్లాడుతూ ఇటీవల కాలంగా యువత దుర్ వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెడు స్నేహాలు చేయకూడదని డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలు వాడిన, అమ్మిన వాడమని ప్రోత్సహించిన వారి వివరాలను తెలియజేయాలని ఆయన తెలిపారు. తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. విద్యార్థి దశలో చక్కటి ప్రణాళిక బద్ధంగా చదువులను కొనసాగించాలని విద్యార్థులకు సూచించారు క్రమశిక్షణ విద్యార్థుల అవసరమని క్రమశిక్షణతోనే విద్యాభ్యాసం జరగాలన్నారు అప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో సీఐ ఆర్ సంతోష్ ఎస్సై తిరుపతి సెయింట్ థెరిస్సా పాఠశాల ప్రిన్సిపల్ జాయిస్ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

రెవెన్యూ సిబ్బందికి ఆత్మస్థైర్యం కల్పించేలా చర్యలు….. ట్రెస్సా జిల్లా అధ్యక్షులు డి శ్రీనివాస్ వికారాబాద్ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధించాలి వికారాబాద్ ఘటన పై నిరసన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా రెవెన్యూ సిబ్బంది

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం  మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి. 

TNR NEWS

అంకిత భావంతో మీసేవలు పని చేయాలి

TNR NEWS

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

TNR NEWS

అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకూ ప్రభుత్వ పథకాలు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

TNR NEWS