Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

లగచర్ల లో జిల్లా కలెక్టర్, అధికారుల పై దాడినీ   తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య 

 

వికారాబాద్ :

లగచార్లలో జిల్లా కలెక్టర్, అధికారులపై జరిగిన దాడి లో బిఆర్ఎస్ నాయకులు ఉద్దేశాపూర్వకంగా సహకరించారని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.

రైతులతో మాట్లాడటానికి తీసుకెళ్లి జిల్లా స్థాయి అధికారులపై దాడికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులు సురేష్.

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ సూచనలతోనే దాడులు జరిగాయని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో రోజురోజుకు బీఆర్ఎస్ ఉనికి కోల్పోవడంతోనే ఇలాంటి దాడులకు ఆద్యం పోస్తున్నారని, ప్రజలు తగిన బుద్ధి చెప్తారు అన్నారు.

రైతులపై తమకు కూడా ప్రేమ ఉందని, వారికి ఎక్కడ అన్యాయం జరగకుండా తగిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును ఓర్వలేకనే బీఆర్ స్ పార్టీ నాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చాలా సందర్భాలలో రైతుల నుండి భూసేకరణ చేసినప్పటికీ ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదని, ఈ సంఘటన చాలా బాధాకరమని ఎమ్మెల్యే కాల యాదయ్య తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులపై రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం దాడులు జరగడం విశారకరామని దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.

రైతులకు ప్రభుత్వం తగు న్యాయం చేస్తుందని అన్నారు.

Related posts

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

Harish Hs

అందరి భాగస్వామ్యంతోనే అభివృద్ధి

TNR NEWS

పారదర్శకంగా నాలుగు పథకాలకు లబ్ధిదారుల ఎంపిక…. జాబితాలో పేర్లు లేని వారు గ్రామ సభలో, ప్రజాపాలన సేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి…… అర్హులకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు….. వేపాలసింగారం ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న…. జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ 

TNR NEWS

మహిళల భద్రత కోసమే షీ టీమ్స్

Harish Hs

ఎస్ఆర్ఎం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

Harish Hs

నేడే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆత్మకూరు మండల సమావేశం హనుమకొండ జిల్లా కో కన్వీనర్ కునుమల్ల రవీందర్ 

TNR NEWS