తెలంగాణ వ్యాప్తంగా డిసెంబర్ 7న ఆటోలు బంద్ నిర్వహించబోతున్నట్టు ఆటో సంఘాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ వారికి హైదరాబాద్ లోని ఆర్టీఏ జాయింట్ కమిషనర్ కు సమ్మె నోటీసులు అందజేశారు. ఫ్రీ బస్సు స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోయానని, తమ సమస్యను రాష్ట్ర సర్కారు పట్టించుకోవడం లేదని ఆటో సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఒకరోజు ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు.
Save or share this story as a newspaper-style Epaper Clip:
