సిరిసిల్ల పట్టణంలో ఆత్మహత్య చేసుకున్న నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.
బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గణేష్ నగర్ లోని నేత కార్మికుడు ఎర్రం కొమురయ్య కుటుంబాన్ని పరామర్శించారు.