మునగాల మండలం పరిధిలోని నర్సింహులగూడెం గ్రామంలో ఈరోజు జిల్లా మహాసభలు సందర్భంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ నుండి సిపిఐఎం (CPIM) పార్టీలోకి పలువురు షేక్ మల్సూర్, షేక్ మైముద్ చేరడం జరిగింది.ఈ కార్యక్రమం లో సిపిఐఎం పార్టీ గ్రామ అధ్యక్షుడు జులకంటి కొండారెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి మొగిలిచర్ల సీతారాములు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని ఆహ్వానించడం జరిగింది.. కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ఎలుగురి నాగయ్య, డివైఎఫ్ఐ గ్రామ శాఖ అధ్యక్షులు ఖాసిం అలి,కోడి సత్యనారాయణ, ఖాదర్, హనుమంతు, మదార్,సాయితేజ,మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Save or share this story as a newspaper-style Epaper Clip:
