Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం ఆనవాయితీ దానిలో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవిని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఎం గురవయ్య హాజరైనట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గురవయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో పాఠ్యాలు బోధించే తీరును ప్రశంసించారు. నైతిక విలువలతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు జి. ఉమా, దీప్తి, నిర్మల, బి. ఉమా, కె.వినోద తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిఐ గా పదోన్నతి పొందిన ఎస్సై రంజిత్ రెడ్డి

Harish Hs

కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలిపిన భూసాని మల్లారెడ్డి

Harish Hs

ఆత్మీయ బహుజన పలకరింపు యాది సభ స్వర్గీయ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ సంతాప సభ

TNR NEWS

దానధర్మాలకు ప్రతీకగా రంజాన్ మాసం

TNR NEWS

రణభేరి సభకు తరలి వెళ్లిన ఆర్యవైశ్యులు

Harish Hs

ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కీసర సంతోష్ రెడ్డి

Harish Hs