Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం ఆనవాయితీ దానిలో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవిని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఎం గురవయ్య హాజరైనట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గురవయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో పాఠ్యాలు బోధించే తీరును ప్రశంసించారు. నైతిక విలువలతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు జి. ఉమా, దీప్తి, నిర్మల, బి. ఉమా, కె.వినోద తదితరులు పాల్గొన్నారు.

Related posts

డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన ఎస్సై ప్రవీణ్ కుమార్  

TNR NEWS

డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువత పని చేయాలి

TNR NEWS

మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు

Harish Hs

బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా పొనుగోటి రంగా ఎన్నిక 

TNR NEWS

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

TNR NEWS

తెలంగాణ ఉద్యమ కళాకారుల రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి

TNR NEWS