Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం ఆనవాయితీ దానిలో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవిని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఎం గురవయ్య హాజరైనట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గురవయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో పాఠ్యాలు బోధించే తీరును ప్రశంసించారు. నైతిక విలువలతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు జి. ఉమా, దీప్తి, నిర్మల, బి. ఉమా, కె.వినోద తదితరులు పాల్గొన్నారు.

Related posts

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

TNR NEWS

గుండాల రాములుకు జోహార్లు

TNR NEWS

మహాత్మ జ్యోతిరావు పూలే134వవర్ధంతి

TNR NEWS

జర్నలిస్టులకు ప్రభుత్వ అండగా ఉంటుంది

TNR NEWS

ఆపదలో అండగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు  కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి

TNR NEWS

TNR NEWS