దానధర్మాలకు ప్రతీక రంజాన్ మాసం అని బాబు చారిటీబుల్ ట్రస్ట్ బాధ్యులు మౌలానా అహ్మద్ నద్వి అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ఈద్గాలో ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం 30 రోజులు కోదాడ పట్టణంలో 1500 మంది పేదలకు 20 నుండి 30 లక్షల విలువగల పది రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు తెలిపారు ప్రతి ఏడాది నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలిపారు. పేదలకు సహాయం చేయడంతోనే తృప్తి కలుగుతుందన్నారు………
