May 11, 2026
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

జిల్లాలో గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు

నేడు,సోమవారం రెండు రోజులు పాటు జరిగే గ్రూప్-III రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని సూర్యాపేట జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట పట్టణంలో 30, కోదాడ పట్టణంలో 20 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి, ఈ కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 163 బి.ఎన్.యస్.యస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 500 మీటర్ల వరకు ప్రజలు గుంపులుగా చెరవద్దు అని కోరారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ నందు పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్ లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకువెళ్లడానికి అనుమతి లేదు అన్నారు. కాళ్లకు షూ వేసుకోవద్దు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లేముందే ప్రధాన గేట్ వద్ద తనిఖీలు నిర్వహించే పోలీసు వారికి సహకరించగలరని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, వాహనాలు వేగంగా నడపవద్దు అన్నారు. ముందుగా బయలుదేరి ఎలాంటి వత్తిడి లేకుండా పరీక్షా వ్రాయాలని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపినారు.

Related posts

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS

ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలు

TNR NEWS

హైదరాబాద్ అడ్డాగా భారీగా డ్రగ్స్ రాకెట్!

Dr Suneelkumar Yandra

సమయం ఎంతో విలువైనది..* — ఛాన్స్ లక్కీ క్లబ్ అధ్యక్షురాలు : లక్ష్మి

TNR NEWS

విద్యా హక్కు చట్టం అమలు చేయండి – సమాచార హక్కు చట్టం సాధన కమిటీ – వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్

TNR NEWS

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS