కాకతీయ కమ సంక్షేమ సంఘం కోదాడ అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు కమ్మ కులస్తులు విద్యా ఉద్యోగ ఉపాధి వాణిజ్య వర్తక రాజకీయ రంగాల్లో రాణించి అగ్రస్థానంలో నిలవాలని కోదాడ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు ఆదివారం చిలుకూరు మండల కేంద్రంలో కమ్మ కులస్తుల కార్తీక మాస వన భోజన మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు కార్తీక మాస వనభోజనాలు ఆధ్యాత్మికతకు ఐక్యతకు ప్రతీకలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కమ్మ కులస్తులు భాగస్వాములై సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. పూర్వికులు సమాజ చైతన్యానికి కృషి చేశారని నేటితరం కమ్మ కులస్తులు కూడా అదే ఆదర్శభావాలను కొనసాగించాలన్నారు. పేద విద్యార్థుల్లో విద్యాభివృద్ధికి ఉన్నత స్థానాల్లో ఉన్న కమ్మ కులస్తులు సహకారం అందించాలని కోరారు మంచి కోసం జరిగే ప్రతి కార్యక్రమానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు ను ఘనంగా సన్మానించారు కాగా కమ్మ కులస్తుల వనభోజనానికి మండల వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కమ్మ కులస్తులు హాజరై విజయవంతం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip:
