Tnrnews.in
తెలంగాణ

కౌకుంట్లలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

చేవెళ్ల   మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం సోమవారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ప్రతిష్ఠాపనా కార్యక్రమాలను ఆలయ ఉత్సవ కమిటీ దిగ్విజయంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామానికి వచ్చిన వారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయడం శుభసూచికమని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవం పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని కోరారు. గ్రామంలోని రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వుండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాయత్రి గోపాలకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్, యువ నాయకులు హరీష్, గ్రామ పెద్దలు మల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యను ప్రజల హక్కుగా మలిచిన ఆజాద్…. కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్….

TNR NEWS

పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం.

Harish Hs

*పసిపాప మరణానికి కారణమైన వారిపై హత్య నేరం కేసు పెట్టాలి*   *బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి*   *పెత్తందారులకు కొమ్ము కాసిన SI, CI పోలీసులను విధుల నుండి తప్పించాలి*   *తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు డిమాండ్….

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు బిల్లు ను ఉపసంహరించుకోవాలి

TNR NEWS

అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం…. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి

TNR NEWS

కందుల కొనుగోలు కేంద్రంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా వ్యవసాయానికి కేసీఆర్ చేసినంత సేవ దేశ చరిత్రలో ఎవరూ చేయలేదు రైతన్నల హామీలు ఇవ్వకపోతే అన్నదాతలతో కలిసి కొట్లాడుతాం అవినీతి రహితంగా కొనుగోలు కేంద్రాన్ని చేపట్టాలి జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి

TNR NEWS