సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కు ఈనెల 18,19 తారీఖులలో అధికారులు సెలవులు ప్రకటించారు. హమాలీల ధరల విషయంలో చర్చలు జరుగుతున్నందున సెలవులు ప్రకటించారు… సీజన్ మొదలు కాకముందే రెండు నెలల ముందే హమాలీలు ధరలు పెంచాలని నోటీసు ఇచ్చినప్పటికీ మార్కెట్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో నేడు సీజన్ లో మార్కెట్ బందు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది….
మార్కెట్ కు ధాన్యం ఎక్కువగా వస్తుంది… ధాన్యం కర్ణాటక కు కూడ ఎగుమతి చేస్తున్నారు… ఇప్పటికే మార్కెట్ లో బీహార్ కు చెందిన పది బ్యాచ్ లతో లోడ్ లు ఎత్తిస్తున్నారు….. మార్కెట్ బందు పెట్టి ధాన్యం కొనుగోలు నిలిపివేయవద్దని రైతులు కోరుతున్నారు…..
Save or share this story as a newspaper-style Epaper Clip:
