Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

కష్టపడ్డ ప్రతి కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలోనే పదవులు

 

గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం దళితులను అన్ని విధాలా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,శుక్రవారం కొండపాక లోని తన నివాసంలో జిల్లా, ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సి డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ ప్రీతం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుంచి పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ సి డిపార్ట్మెంట్ జిల్లా కన్వీనర్ లు, ముత్యాల యాదగిరి, ఎర్ర స్వప్న, అసెంబ్లీ కన్వీనర్ గా బొడ్డు బాలరాజు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా చేగురి యాదగిరి లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పై నమ్మకం తో మాకు బాధ్యతలు అప్పగించిన ప్రీతం కి, జిల్లా అధ్యక్షలు విజయ్ కుమార్ లకు మరియు నియోజక వర్గ ఇంచార్జ్ పూజలు హారికృష్ణ,మరియు సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

ఆరుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

TNR NEWS

విత్తనాల కొనుగోలులో రైతులు జాగ్రత్తలు పాటించాలి  మండల వ్యవసాయ అధికారి బి.రాజు

TNR NEWS

మతిస్థిమితం లేని వ్యక్తిని ఎస్ ఐ ఆదేశాల మేరకు ఆశ్రమంకు తరలింపు

Harish Hs

డబ్బా కోట్లు తొలగించవద్దంటూ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన

Harish Hs

57వ జాతీయ వారోత్సవాలకు హాజరైన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు 

TNR NEWS