Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

*కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోదిత దినోత్సవ వేడుకలు* ….

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం గొప్పదని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు *గుండెపంగు.రమేష్* , *గంధం పాండు* ఆధ్వర్యంలో హుజూర్నగర్ రోడ్డు లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో పౌరులు అందరూ స్వేచ్ఛగా జీవించడానికి రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు బాధ్యతలను కల్పించిందన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపాలన సాగిస్తుందన్నారు.అంబేద్కర్ ఆశయాల సాధన కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనినేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుండెపంగు రమేష్, గంధం పాండు, రాష్ట్ర నాయకులు షేక్ బషీర్,భాష బోయిన భాస్కర్,గంధం యాదగిరి,బాగ్దాద్,కాసర్ల రాజశేఖర్, ,సోమపంగు వెంకటయ్య,పిడతల శ్రీను,జంగం శ్రీను, కుడుముల సైదులు,కుడుముల రాంబాబు, ఎర్ర శ్రీను, లచ్చిమల్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు……….

Related posts

కోదాడ వాసికి డాక్టరేట్ ప్రధానం

Harish Hs

బడ్జెట్ లో వ్యవసాయ కార్మికుల, పేదల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం..  ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలి

TNR NEWS

సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరానికి ఆదర్శనీయం………  ఆదర్శ మహిళ సావిత్రిబాయి పూలే…..  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి……..

TNR NEWS

జుక్కల్ ఎమ్మెల్యేను అభినందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

TNR NEWS

సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేసిన మంత్రి కొండా సురేఖ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

TNR NEWS